చంద్రబాబు అరెస్ట్ హేయం: పురందేశ్వరి 

చంద్రబాబు అరెస్ట్ హేయం: పురందేశ్వరి 

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని  బీజేపీ ఏపీ  అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. సరైన నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు.  ఎఫ్ఎస్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా ఏ విధంగా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదని, బీజేపీ  దీనిని ఖండిస్తోందని అన్నారు.