ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం సర్వసాధారణం: సజ్జల
చంద్రబాబు అరెస్టుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం సర్వసాధారణమన్నారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైందని, చాలామందని అరెస్టు చేశారని అన్నారు. స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్లో బాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. కేసు సీఐడీకి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. రూ. 340 కోట్లలో రూ. 270 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు అరెస్టులో రాజకీయ ప్రమయేయం లేదని సజ్జల చెప్పారు.