టీడీపీ నేతలతో లోకేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌

టీడీపీ నేతలతో లోకేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌

యువగళం నిర్వహాణపై చర్చ
తాడేపల్లి: టిడిపి ముఖ్య నేతలతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమావేశం అయ్యారు. పార్టీ పోలిట్‌ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇంఛార్జ్‌ లు, పార్లమెంట్‌ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులతో అయన  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యువ గళం పాదయాత్ర నిర్వహణ పై చర్చ జరిగింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పై పోరాడటానికి జాతీయ ప్రధాన కార్యదర్శి యువ గళం పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. పార్టీ యంత్రాంగం మొత్తం యువ గళం యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చెయ్యాలి. మూర్ఖుడి పాలనలో ప్రజలు నలిగిపోతున్నారు.  రాష్ట్రం మళ్ళీ అభివృద్ది పథంలో నడవాలి అంటే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు.

నారా లోకేష్‌ మాట్లాడతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు నమస్కారం. మూడున్నర ఏళ్లుగా మనం ఒక సైకో పై పోరాడుతున్నాం. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు... గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కార్యకర్తలు, నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి కేసులు పెట్టి వేధించారు. అయినా విూరు ఎక్కడా తగ్గలేదు పోరాడారు. టిడిపి కి బలం కార్యకర్తలు, నాయకులే. మనం అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ రెడ్డి లా చేసుంటే వైసిపి ఉండేది కాదు. ఆ పార్టీ నాయకులంతా ఇతర దేశాలకు పారిపోయేవారు. కానీ మన వాళ్ళు అలా కాదు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఎం పీకుతావో పీకు అని తొడకొట్టారు. పసుపు జెండా కోసం ప్రాణం ఇచ్చే బ్యాచ్‌ మనది. ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చెయ్యొచ్చు. కానీ జగన్‌ రెడ్డి కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకున్నారని అన్నారు.
 
అందుకే ఈ మధ్య మంత్రులు. ఎమ్మెల్యేలు, నాయకులు జగన్‌ రెడ్డి చెత్త పరిపాలన గురించి విమర్శిస్తున్నారు.  వార్‌ ఒన్‌ సైడ్‌ అయిపొయింది. ప్రజలంతా మన వైపు ఉన్నారు. సైకో పాలన పోయి సైకిల్‌ పాలన రాబోతుంది .దీని కోసం మనం అంతా ఇంకా ప్రజలకు మరింత దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం బాదుడే బాదుడు... ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాం.  విూ అందరికి ఆశీస్సులతో త్వరలో నేను యువగళం పాదయాత్ర చేపట్టబోతున్నాను. యువత ని జగన్‌ మోసం చేసాడు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసాడు. విదేశీ విద్య పధకం రద్దు చేసాడు. ఉన్న కంపెనీలను తరిమేసాడు. 

కొత్త కంపెనీలు రావడం లేదు. ఈ నేపథ్యంలో నేను ప్రజా సమస్యల పై పోరాటం చేసేందుకు యాత్ర చేస్తున్నాను. అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా పోరాడతాను. ప్రభుత్వం స్పందించకుంటే టిడిపి ప్రభుత్వం వచ్చిన వేంటనే సమస్యలు  పరిష్కరిస్తాం.400 రోజులు, 4 వేల కిలోవిూటర్ల మేర నా పాదయాత్ర సాగుతుంది.విూ సూచనలు, విూ మద్దతు నాకు కావాలి.  మన దేవుడు ఎన్టీఆర్‌ గారి ఆశయాలను, మన రాముడు చంద్రబాబు విజన్‌ ని ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతుందని అన్నారు. పలు సూచనలతో పాటు పాదయాత్ర విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని సీనియర్‌ నాయకులు అన్నారు.