74 వ రోజుకు చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆత్మగౌరవ యాత్ర

74 వ రోజుకు చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆత్మగౌరవ యాత్ర

 ముద్ర ప్రతినిధి: సిద్దిపేట : సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాథ్ జోడో  ఆత్మగౌరవ యాత్ర 74 వ రోజుకు చేరింది. సోమవారం నాడు నియోజకవర్గ పరిధిలోని మిరుదొడ్డి  మండలం కొండాపూర్ గ్రామంలో ఆత్మగౌరయాత్రను ఆయన కొనసాగించారు. దుబ్బాక ఆత్మ గౌరవ యాత్ర నిర్వహిస్తూ ప్రజల సమస్యలను, కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు.గ్రామంలో ఉన్న బీడీ కార్మికుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు అనంతరము బీడీ కార్ఖానాలోకి వెళ్లి ఆకు తంబాకును తూకం వేసి కూలీలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు