ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

ముద్ర, మల్యాల: మల్యాల కొత్తపేట ప్రాంతంలో నూతనంగా నిర్మించనున్న ముత్యాల పోచమ్మ (సీతల దేవి ) ఆలయంకు సోమవారం శంకుస్థాపన చేశారు. స్థానిక మందాటు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, స్థానికులు  పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేదపండితులు కమిటీ సభ్యులు ఎల్లాల జనార్దన్ రెడ్డి దంపతులచే గణపతి పూజ,  నవగ్రహ పూజ, కంకణధారణ, పుణ్యహవచనం, కళశపూజ,  అభిషేకం, హోమం, తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అందరికి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎల్లాల జనార్దన్ రెడ్డి, నేరెళ్ల భూమారెడ్డి, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, నేరెళ్ల శ్రవణ్, మిట్టపల్లి దశరథo, గాండ్ల భూమేష్, కన్నోజీ రామ్మోహన్, కస్తూరి మహేష్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎంపీపీ మిట్టపల్లి విమల, సర్పంచ్ సుదర్శన్ లు పోచమ్మ ఆలయానికి స్వంత ఖర్చులతో బోరు వేయించారు. ఈ సందర్బంగా వారిని కమిటీ సభ్యులు సత్కరించగా, పండితులు ఆశీర్వదించారు.