తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం- జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ 

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం- జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావా వసంత సురేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో బాగంగా జగిత్యాల అర్బన్ మండలంలోని అంబర్ పేట గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమానికి హాజరైన జడ్పీ చైర్ పర్సన్ రైతులతో కలిసి ఎడ్ల బండి, ట్రాక్టర్ లతో ర్యాలీ గా రైతు వేదికకు చేరుకున్నారు. రైతు దినోత్సవ సంబరాలు ముగిసిన అనంతరం రైతులకు  భోజనం వడ్డించి, వారితో కలిసి సహా పక్తి  భోజనం చేశారు. ఈ సందర్బంగా వారితో ముచ్చటించగా,  రైతులు కేసీఆర్ సారే మళ్ళీ రావాలి కేసిఆర్ సల్లగ ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో అర్ధిఒ మాధురి, స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్, జెడ్పీటీసీ మహేష్, ఎంపీపీ లక్ష్మీ,  సర్పంచ్ గంగాధర్, మాజీ జెడ్పీటీసీ జితేందర్ రావు, మాజీ ఎఎంసి చైర్మన్ దామోదర్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు దామోదర్ రావు, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ జుంబర్తి శంకర్, సర్పంచ్ లు లక్ష్మ రెడ్డి,జయ, ఎంపీటీసీ శేఖర్ రెడ్డి,మల్లారెడ్డి ఎంపిడివో, ఏపీఎం ఏఓ,  ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.