వ్యభిచారం ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

వ్యభిచారం ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

ఇద్దరు నిర్వహకులు, ఓ విటుడు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని  హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతంలో గుట్టుగా వ్యబిచారం నిర్వహిస్తున్న ముఠాను సోమవారం జగిత్యాల టౌన్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టౌన్ సిఐ నటేష్ మాట్లాడుతూ హోసింగ్ బోర్డ్ కాలనీ శివారు ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్న ఓ ముఠా వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి మహిళల ఫోటోలను గ్రూప్ లో పెడుతూ విటులను ఆకర్షిస్తు వ్యభిచారం నిర్వహించే వారని అన్నారు.

జగిత్యాలకి చెందిన మహమ్మద్ రిజ్వాన్, రుబినాలు గత కొంతకాలంగా ఈ వ్యభిచార ముఠాను నడిపిస్తున్నారని, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ నాలుగు కేసుల్లో రూబీన నిందితురాలని తెలిపారు. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు హౌసింగ్ బోర్డ్ లోని ఓ ఇంటిపై దాడి చేయగా నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు పట్టుబడ్డారని తెలిపారు. అందులో ఇద్దరు నిర్వాహకులు కాగా మరో ముగ్గురు మహిళలు విశాఖ పట్టణం, వరంగల్ ప్రాంతాల చెందిన వారని, వారిని వ్యభిచారం కోసం తీసుకు వచ్చినట్లు సిఐ తెలిపారు. ఇద్దరు నిర్వాహకులు మొహమ్మద్ రిజ్వాన్, రుబీనాలతోపాటు విటుడు శ్రీనివాసు ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని, ముగ్గురు మహిళలను సఖి కేంద్రానికి కౌన్సిలింగ్ కోసం పంపినట్లు తెలిపారు. సమాజంపై చెడు ప్రభావం చూపే ఇలాంటి వ్యభిచార ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు.