నేటి నుంచి లక్ష సాయం...
![నేటి నుంచి లక్ష సాయం...](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b55bcf99dd0.jpg)
ముద్ర, మల్యాల: బీసీ కులవృత్తులు, చేతి వృత్తిదారులకు నేటి నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష సాయం అందనుంది. మొదటి విడుతగా ప్రభుత్వం నియోజకవర్గంకు 300 కేటాయించగా, మల్యాల మండలంలో 50 మంది లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు, మంగళవారం వారం నుంచి లబ్ధిదారులకు లక్ష సాయం అందనున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.
అయితే మండలంలో మొత్తం 540 వరకు అప్లికేషన్స్ రాగా, కొన్ని కులాలు మినహా, మిగతా కులాల నుంచి 500 మంది లబ్ధిదారుల పేర్లు సిద్ధం చేసినట్లు ఎంపీడీఓ వెంకటేష్ తెలిపారు. కాగా, ఆశవాహులు ఇంకా ఉన్నప్పటికీ సంబందిత ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతొ వారు దరఖాస్తు చేసుకోలేదు. ఇది ఇలా ఉండగా, కేవలం 50 మందికి మాత్రమే సాయం అందజేస్తుండడంతో మిగిలిన లబ్ధిదారులు నిరుత్సాహంతో ఉన్నారు. ఎన్నికల లోపు లబ్ధిదారులoదరికి అందజేయాలని పలువురు డిమాండ్ చేశారు.