రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు  క్షీరాభిషేకం

రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు  క్షీరాభిషేకం
  • ముఖ్య అతిథులుగా  బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ముద్ర, ఎల్లారెడ్డిపేట:తెలంగాణ రైతాంగానికి  ముఖ్యమంత్రి కేసిఆర్  రుణమాఫీ ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి  క్షీరాభిషేకం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం స్థానిక పాత బస్టాండ్ లో   గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు లు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా  వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటీ ముందు  సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్లతో కలిసి  కేసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీలు  పందిర్ల నాగరాణి, ఎనగందుల అనసూయ, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి,మాజీ సెస్ డైరెక్టర్ మల్లారెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు  ఎడ్ల సందీప్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.