ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు..

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు..

ముద్ర,రుద్రంగి:రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు .మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప రాణి గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.. మండలంలోని సింగం నర్సయ్య, దేగవత్ గెన్యా ఇద్దరు వికలాంగులకు వీల్ చైర్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం వద్ద గల గాంధీ విగ్రహానికి గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి మరియు కాంగ్రెస్ శ్రేణులు గాందీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మానాలలో సర్పంచ్ అల్లూరి మానస, వైస్ ఎంపీపీ భూమయ్య గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనీ,భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి శాంతిమార్గంలో స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడన్నారు. ఆయన అనుసరించిన మార్గాలను ప్రతి ఒక్కరు ఆచరించినప్పుడే మన దేశం సుఖశాంతులతో ఉంటుందన్నారు.