యువతి కడుపు నుండి అరుదైన కణతి తొలగింపు...

యువతి కడుపు నుండి అరుదైన కణతి తొలగింపు...

మెట్‌పల్లి ముద్ర:- మెట్‌పల్లి పట్టణంలోని గాయత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మంగళవారం డాక్టర్ సంధ్య రాణి  అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి కణతి తొలగించారు. మల్లాపూర్ మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన ఒక యువతి కొన్ని రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని గాయత్రి స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరింది. ఆపరేషన్ చేసి 6 కిలోల బరువు గల కణతి తొలగించారు వైద్యులు. అరుదైన ఆపరేషన్ చేసి కణతి తొలగించిన వైద్యురాలు. సంధ్య రాణి, హాస్పిటల్ స్టాఫ్, సిబ్బందికి పేషంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు