బాధిత కుటుంబానికి చేయూత.. రూ. 33,701 అందజేత..

బాధిత కుటుంబానికి చేయూత.. రూ. 33,701 అందజేత..

ముద్ర, మల్యాల: మల్యాల మండల కేంద్రoలోని బీసీ కాలనీకి చెందిన ఐతరవేణి రమేష్ ఇటీవల వడదెబ్బ కారణంగా మృతి చెందగా, స్థానిక మాజీ వార్డ్ సభ్యులు, కాలనీ పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల సంతోష్, ప్రస్తుత వార్డ్ సభ్యులు మిట్టపల్లి దశరథoలు సోషల్ మీడియా ద్వారా పలువురు దాతల సహకారంతో రూపాయలు 33,701 సమకూర్చారు. ఈ నగదును గురువారం బాధిత కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి అందజేశారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు కావడంతో వారి చదువుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాండ్ల వేణు, ఎండీ అల్లావొద్దీన్, ఎండీ జమీల్, సిరపురం రాజు, తదితరులు పాల్గొన్నారు.