ఘనంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామికి   రుద్రాభిషేకం..

ఘనంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామికి   రుద్రాభిషేకం..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ నవరాత్రి ఉత్సవాలలో  భాగంగా ఆదివారం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు.  అంతకుముందు ఆలయంలో పూర్ణాహుతి షోడశ ఉపచార పూజ సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, రేనోవేషన్  కమిటీ చైర్మన్ ఇందారపు రామన్న, సభ్యులు గందె పద్మ శ్రీనివాస్, అక్కినపల్లి సురేందర్, వీర వేణి కొమురయ్య, చుక్క రవి, స్తంభంకాడి మహేష్, ఇనుగంటి రమా వెంకటేశ్వరరావు, గుడి శెట్టి రవీందర్, పల్లెర్ల సురేందర్, గుంపుల రమేష్, వేముల నరేష్, జైన రాజమౌళి, సంగెం సురేష్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్,  ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ, నేరళ్ల  శ్రీనివాసచారి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.