ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించాలి..

ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించాలి..

ముద్ర, మల్యాల:-ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మల్యాల తహసీల్దార్ సుజాతకు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. స్థానిక బ్లాక్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య కులంలో పేద, ధనికులు ఉన్నారని, ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పేద వారిని ఆదుకోవాలని కోరారు. అలాగే వివిధ రిజర్వేషన్ లతో తమ పిల్లలు చదువు, ఉద్యోగ విషయంలో చాలా నష్టపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బట్టు పవన్, సభ్యులు పోచమల్ల ప్రవీణ్, బట్టు విజయ్, సూర మహేష్, వొజ్జల లక్ష్మణ్, శ్రీనివాస్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.