ఉత్తమ ప్రతిభ అవార్డులు అందజేసిన అదనపు కలెక్టర్ రమేష్
![ఉత్తమ ప్రతిభ అవార్డులు అందజేసిన అదనపు కలెక్టర్ రమేష్](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647f36c9dac52.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: మీ సేవా రంగంలో అత్యధిక లావాదేవీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరచిన 8 మందికి అదనపు కలెక్టర్ రమేష్ అవార్డులను అందజేశారు. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐ.టి. రంగంలో వివిధ అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 8 మందిని తెలంగాణా రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కార్యాలయం ఎంపిక చేసి జాబితా పంపింది. మంగళవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లాలో 66 మీ-సేవా కేంద్రాలకు గాను అత్యధిక లావాదేవీలు, ఆధార్ నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేట్ మీ సేవా కేంద్రం విలేజ్ లెవెల్ ఎంట్రప్రెన్యూర్ లకు ఈ అవార్డులు వరించాయన్నారు. అవార్డులు అందుకున్న వారిలో మెదక్ కు చెందిన సుమలత, నరేష్, రాజు, చేగుంటకు చెందిన సాయిబాబు, చిన్న శంకరంపేటకు రంజిత్ కుమార్, రాధికా, నర్సాపూర్ విజయ్ కుమార్ లతో పాటు టిఎస్ టిఎస్ఎస్ జిల్లా మేనేజర్ శశికాంత్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. హరిదీప్ సింగ్, వి.ఎల్.ఈ.లున్నారు.