కల్నల్ సంతోషబాబు త్యాగం చిరస్మరణీయం

కల్నల్ సంతోషబాబు త్యాగం చిరస్మరణీయం

కల్నల్ సంతోషబాబు త్యాగం చిరస్మరణీయం-కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ, ముద్ర:దేశం కోసం కల్నల్ సంతోషబాబు  చేసిన త్యాగాన్ని భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా కోదాడలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల జీవితాల త్యాగ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు   కల్నల్ సంతోషబాబు అని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.

నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ జగనీ ప్రసాద్, ఆర్యవైశ్య నాయకులు గారినే శ్రీధర్,వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు బెలిదే భరత్ కుమార్,ఉప్పల నవీన్, యదా కిరణ్,భరత్ చంద్ర,బండారు శ్రీనివాసరావు,సాయి, వెంపటి ప్రసాద్, రంజిత్, పైడిమర్రి సతీష్, రామారావు, పోలిశెట్టి సతీష్,తదితరులు పాల్గొన్నారు.