ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తలకు గాయం

ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తలకు గాయం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థికి తలకు గాయమైన సంఘటన జరిగింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సిరోజ్ అనే విద్యార్థినీ  అకారణంగా రాత్రి డ్యూటీ లో ఉన్న ఉపాధ్యాయుడు తలపై కొట్టడంతో తలకు గాయమై రక్తస్రావం అయింది. దీంతో తోటి ఉపాధ్యాయులు ముందుగా ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లగా అక్కడ చికిత్స చేసేవారు లేకపోవడంతో ప్రైవేట్  ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య చికిత్స చేయించారు. జరిగిన సంఘటనపై ప్రిన్సిపల్ఉమా రెడ్డి మాట్లాడుతూ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కోదాడ ప్రాంతం నుండి పాఠశాలకు వస్తున్నట్లు సమాచారం.