మా గ్రామాల్లోకి కాంగ్రెస్ కు ఎంట్రీ లేదు

మా గ్రామాల్లోకి కాంగ్రెస్ కు ఎంట్రీ లేదు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మా గ్రామాల్లోకి కాంగ్రెస్ కు అనుమతి లేదంటూ పలు గ్రామాల ప్రజలు, రైతులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట తో పాటు కరీంనగర్- సిరిసిల్ల హైవేపై బొమ్మకల్ కమాన్ పూర్, బావు పేట కాజీపూర్ లతో పాటు పలు గ్రామాల్లో రైతులు కాంగ్రెస్ కు గ్రామంలోకి అనుమతి లేదంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. రైతులకు కరెంటు మూడు గంటలన్న కాంగ్రెస్ పార్టీకి మా ఊర్లోకి ప్రవేశం లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక బిఆర్ఎస్  నాయకులు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు చర్చ నడుస్తుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. బుధవారం రాత్రి బొమ్మకల్లు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ శ్రేణులు చింపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.