జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా డి. గాయత్రి బాధ్యతల స్వీకరణ

జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా డి. గాయత్రి బాధ్యతల స్వీకరణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు:  జిల్లా నూతన మద్య నిషేధం, ఆబ్కారీ అధికారిగా డి. గాయత్రి గురువారం బాధ్యతలు స్వీకరించారు.జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.అనంతరం ఆమె కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.డి గాయత్రి ఇంతవరకు వికారాబాద్ జిల్లా మద్యనిషేధం, ఆబ్కారీ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు.నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేసిన జిల్లా మధ్యనిషేధం, ఆబ్కారీ శాఖ అధికారి షేక్ ఫయాజుద్దీన్ మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాకు బదిలీపై వెళ్లారు.నాగర్ కర్నూల్ మున్సిపల్ నూతన కమిషనర్ నరేష్ బాబు గురువారం జిల్లా కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చన్ని అందజేశారు.