మిసెస్ గాంధీ కోసం కసరత్తు

మిసెస్ గాంధీ కోసం కసరత్తు

నటిగానే కాదు దర్శకురాలిగానూ నిరూపించుకుంది ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్‌. ప్రస్తుతం ఆమె నటిస్తూ..దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది కంగన. ఇందులో యాక్షన్‌ సన్నివేశాలకు ప్రత్యేకంగా వర్కవుట్లు చేస్తోందామె. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ఈ సినిమాలో మిసెస్‌ గాంధీగా కనిపించడానికి రెండేళ్ల తరవాత నేను నా దినచర్యలో మళ్లీ వ్యాయామాన్ని మొదలు పెట్టాను. రాబోయే ఈ చిత్రంలో నాలో మార్పు కోసం ఎదురుచూస్తున్నాను’ అని వ్యాఖ్యల్ని జోడించింది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కాగా తాజాగా ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలొ కంగనా వెడ్డింగ్ కార్డు చూపిస్తూ వారికి శుభవార్త ను చెప్పింది. మీరందరూ కూడా పెళ్లికి హాజరు కావాలని వారిని అందరిని ఆహ్వానించింది. అయితే వెడ్డింగ్ కార్డులో ఆమె పేరు లేకపోవడంతో వారంతా కూడా షాక్ అయ్యారు.. దీంతో కంగనా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు బాగా వినిపిస్తునాయి. కాగా ఇదంతా కూడా కంగనా నిర్మిస్తున్నా చిత్రం టిక్కు అండ్ షేరు సినిమా మూవీ ప్రమోషనన్స్ లో భాగంగానే చేసినట్లు సమాచారం.. దీనిని ఓటీటీ లో విడుదల చేయనున్నారు