వైభవంగా సీతారాముల కళ్యాణo, చల ప్రతిష్ట మహోత్సవం

వైభవంగా సీతారాముల కళ్యాణo, చల ప్రతిష్ట మహోత్సవం

కోరుట్ల, ముద్ర:  పట్టణంలోని సాయిరాంపుర కాలనీలోని ఆదివారం రోజు భక్తఆంజనేయ స్వామి దేవాలయంలో సీతా రామచంద్ర మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాల చల ప్రతిష్ట మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మన్న గారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఊదయం పుణ్యాహవాచనం, గౌరి, గణపతి పూజ, సర్వతో భద్ర మండల, యోగిని, వాస్తు, నవగ్రహ, కలష స్థాపన మరియు జల, పుష్ప, దాన్య, శయ్యాధి వాసలు అదే విదంగా స్థాపిత దేవతా హోమాలు, సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయ కమీటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమీటీ సభ్యులు దురిశెట్టి సత్య నారాయణ, ప్రశాంత్, కిరణ్ కంచె కుమార స్వామి, విలాసాగర్ రవి, పెడిమల్ల రాజు, నడిగడ్డ రాజు, మనోహర చారీ, రాజేంద్ర ప్రసాద్, ప్రభు, భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.