బిజెపి గడపగడపకు ప్రచారం..

బిజెపి గడపగడపకు ప్రచారం..

మెట్‌పల్లి ముద్ర: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మహాజన్ సంపర్క్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బిజెపి నినాదంతో గురువారం పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఏరియాలో గడపగడపకు తిరుగుతూ ప్రధానమంత్రి తొమిది ఏళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రానున్న రోజుల్లో మరింత విస్తరింప చేస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు తెలిపేందుకు.9090 90 24 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరారు.బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధోనీకేల నవీన్,జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట విజయ్,కార్యవర్గ సభ్యుడు గొప్నవేణి రమేష్ యాదవ్, కిషన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు లోలపు అనిల్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి, కుడుకల రఘు జిల్లా నాయకులు బొడ్ల గౌతం, కిషన్ మోర్చా పట్టణ అధ్యక్షులు జెట్టి రూపేష్, రాజు, సుతరి భూమరెడ్డి, జెట్టి సంజీవ్, కట్ట శ్రీకాంత్, దొంతుల చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు