ప్రశాంతంగా గ్రూప్ ఫోర్త్ పరీక్షలు

ప్రశాంతంగా గ్రూప్ ఫోర్త్ పరీక్షలు

 ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి

ముద్ర, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి రూసో కళాశాలలో జరిగిన గ్రూప్ ఫోర్త్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. చీప్ సూపర్డెంట్, లైజరింగ్ ఆఫీసర్ ఏలాంటి మాస్ కాపీ జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. రూసో కాలశాలలో 456 అభ్యర్థులకు గాను 372 మంది అభ్యర్థులు హాజరయ్యారు.