తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు...జర భద్రం

తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు...జర భద్రం

ముద్ర,తెలంగాణ:- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజులు 2 నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకు అధిక ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది వాతావరణశాఖ. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.