ఎండిన పంటను కాపాడుకోబోయి

ఎండిన పంటను కాపాడుకోబోయి

కరెంట్‌ షాక్‌ రైతు మృతి

జనగామ జిల్లాలో ఘటన

ముద్ర ప్రతినిధి, జనగామ : ఎండిపోతున్న పంట పొలాన్ని కాపాడుకునేందుకు ఓ రైతు పడిన తాపత్రయం ఆయన ప్రాణాలను తీసింది. జనగామ జిల్లా అడవికేశ్వపురంలో జరిగిన ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. అడవి కేశవపురం గ్రామానికి చెందిన గూడూరు రాజు (27) రెండు ఎకరాలల్లో వరి సాగు చేశాడు.

అయితే ఎండిపోతున్న పంటను చూసి కొన్ని రోజులుగా బాపడిన రాజు ఎలాగైన దానిని కాపాడాలని భావించాడు. ఈ క్రమంలో సోమవారం పొలానికి సమీపంలోని ఉన్న నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్లలో మోటర్‌‌ను ఏర్పాటు చేసుకుని నీళ్లను తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరెంట్‌తో రాజు చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.