విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
![విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640f2a2eeb949.jpg)
ముద్ర, జనగామ టౌన్ : జనగామ రైల్వే స్టేషన్ రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తెలుగు మీడియం విద్యార్థులకు సావిత్రి బాయి ఫూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. దాతలు దళిత రత్న చెప్పాలా ప్రసాద్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ నీలం కొర్నిలియస్ సహకారంతో స్టడీ మెటీరియల్తో పాటు పరీక్ష ప్యాడ్లు,పెన్ పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే, జ్యోతి రావు ఫూలే ఆశయాలు కొనసాగించి ఉన్నత చదవాలన్నారు.
కార్యక్రమంలో దాతలు నీలం కోర్నిలియస్, దళిత రత్న చెప్పాలా ప్రసాద్, ఫౌండేషన్ అధ్యక్షుడు యాసారపు కరుణాకర్, హెచ్ఎం వి.కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు చొక్కయ్య, కనకయ్య, మురళి, అనిత, పారిజాతం, ఫౌండేషన్ సభ్యులు యాసారపు నర్సింగరావు, భాస్కర్, దడిగా సందీప్ పాల్గొన్నారు.