వెంకన్న హుండీ ఆదాయం రూ9.88లక్షలు 

వెంకన్న హుండీ ఆదాయం రూ9.88లక్షలు 

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ. 9,88,767 తో పాటు ఒక అమెరికా డాలర్ వచ్చాయి. మంగళవారం జరిగిన హుండీ లెక్కింపులో దేవాదాయ, ధర్మాదాయ శాఖ నల్లగొండ జిల్లా ఇన్స్పెక్టర్ సుమతీ, స్థానిక కార్యనిర్వాహణాధికారి వెంకట్రావు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, డైరెక్టర్లు అర్చకులు రవీందర్ శర్మ, రంగాచార్యులు, చిల్పూర్ మండల డిప్యూటీ తహసిల్దార్ కాసిం నాయక్, పోలీస్ సిబ్బంది, పద్మశాలి సేవాసమితి సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.