ముత్తిరెడ్డికి నిరసన సగ

ముత్తిరెడ్డికి నిరసన సగ

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నిరసన సెగ తగిలింది. శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులు బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆదివారం ధర్నా చేపట్టారు. వారికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపారు. మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రైతులకు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారూ.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నిరసన కారులు అడ్డుకున్నారు. పోలీసులు నిరసన కారులను చెదరగొట్టే ప్రయత్నంలో‌ స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేకి భూకబ్జాలు, అక్రమంగా సంపాధించిన డబ్బుల మీద ఉన్న చిత్తశుద్ధి రైతుల మీద లేదని విమర్శించారు.