జనగామ అడిషనల్‌ కలెక్టర్‌‌ ప్రపుల్ దేశాయ్‌ బదిలీ

జనగామ అడిషనల్‌ కలెక్టర్‌‌ ప్రపుల్ దేశాయ్‌ బదిలీ

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌‌ ప్రపుల్‌ దేశాయ్ (స్థానిక సంస్థలు) కరీంనగర్‌‌ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ శాంతకుమారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రపుల్‌ దేశాయ్‌ గత సంవత్సవరం నవంబర్‌‌లో జనగామ జిల్లాకు తొలి పోస్టింగ్‌పై వచ్చారు.

అంతకుముందు సిద్దిపేట ట్రైనీ కలెక్టర్‌‌గా పనిచేశారు. జనగామలో దాదాపు 8 నెలల పాటు విధులు నిర్వహించిన ప్రపుల్‌ దేశాయ్ అటు అధికారులు, సిబ్బందితో పాటు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బదిలీ అయిన ఆయన స్థానంలో ఇప్పటివరకు ఎవరినీ కేటాయించలేదు.