అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరికలు : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

బీఆర్ఎస్ లో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ముద్ర ప్రతినిధి, నల్గొండ: జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులే టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామం నుండి 100 మందు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా జరగని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. అవినీతికి అడ్రస్ గా ఉన్న కాంగ్రెస్, బిజెపి లను మట్టు కల్పించి మూడోసారి బీఆర్ఎస్ గెలుపుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ గెలుపు తద్యమని ధీమానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం సైదులు, పిఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ మనెమ్మ వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు పొడిశేటి సైదులు, ఉపాధ్యక్షులు అనంతుల లింగయ్య, గండమల్ల అంతయ్య, వంగూరి రాజు, దోనాల కొండల్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.