తెలంగాణ రైతాంగాన్ని దగా చేసిన కేసిఆర్ సర్కార్ - మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు
![తెలంగాణ రైతాంగాన్ని దగా చేసిన కేసిఆర్ సర్కార్ - మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_65279b6b54485.jpg)
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి : తెలంగాణ రైతాంగాన్ని కేసిఆర్ సర్కార్ దగా చేసిందని హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. గురువారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని లక్ష్మీపూర్, రాయపేట గ్రామంలో పాదయాత్రగా ప్రతీ గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను వివరించడం జరిగించారు. ఈ లక్ష్మీపూర్, రాయపేట గ్రామంలో స్ధానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యం అని ఇసుక, చెరువులు మట్టి దోచుకోవడం, భూముల కబ్జాలు మరియు అవినీతిలో మొదటి వరుసలో ఉంటాడని మండిపడ్డారు. తాలు , తరుగు పేరిట రైతుల వడ్ల కటింగ్ ను అరికట్టకుండా, మిల్లర్లతో కుమ్మక్కై రైతులందరిని నిలువు దోపిడి చేసిన స్థానిక ఎమ్మెల్యే దాసరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానన్ను రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా ఉంటాయని మరియు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలందరికీ అండగా నిలిచి గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ బీఆర్ఎస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ మరియు నిత్యవసర ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ మహిళలు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు.