అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతే: చంద్రబాబు
అమరావతి రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందని చెప్పారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. అమరావతి ఉద్యమం వైకాపా ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి ముందుకు సాగుతోందన్నారు. అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతేనని ఆయన పేర్కొన్నారు. కియా పరిశ్రమపై గతంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్లో చంద్రబాబు ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కియాను తరిమేస్తానంటూ ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. కియాపై నాడు జగన్ చేసిన వ్యాఖ్యలు.. తాజాగా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్లను ప్రస్తావిస్తూ వీడియోలను చంద్రబాబు ట్విటర్లో పోస్ట్ చేశారు. కెన్యూ ఆన్సర్ మిస్టర్ జగన్? అని ఆయన ప్రశ్నించారు.