IND vs NZ: తొలి సెమీస్ సమరం.. టాస్ గెలిచిన టీమిండియా

IND vs NZ: తొలి సెమీస్ సమరం.. టాస్ గెలిచిన టీమిండియా

ముద్ర, తెలంగాణ:-వరల్డ్ కప్ 2023లో తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. భారీ స్కోరు చేసి కివీస్ పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ చెప్పాడు.లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లనూ గెలిచి ఓటమెరగని జట్టుగా సెమీస్ చేరిన టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అటు న్యూజిలాండ్ మాత్రం కాస్త కష్టంగానే నాలుగో స్థానంతో సెమీఫైనల్ చేరింది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఇండియాపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించిన కివీస్ జట్టును నాకౌట్ స్టేజ్ లో అంత సులువుగా తీసి పారేయలేం. 

ఇండియా తుది జట్టు ఇదే..

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమి, సిరాజ్

న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..

కాన్వే, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మాన్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్