బీడీలు చుట్టి.. ముచ్చట్లు పెట్టి..

బీడీలు చుట్టి.. ముచ్చట్లు పెట్టి..

ముద్ర ప్రతినిధి, జనగామ : ఎన్నికల వేళ ఓటర్లు ప్రసన్నం చేసుకుకేందుకు లీడర్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.. ప్రతి ఒక్కరిని అక్కా, తమ్ముడు, అన్నా, చెల్లి, అమ్మా.. అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఓటేయాలని కోరుతుంటారు. జనగామ నుంచి బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలో ముమ్మరం ప్రచారం చేశారు. తనదైన శైలిలో వృద్ధులను పలకరిస్తూ.. ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. 13వ వార్డులో ప్రచారంలో ఓ బీడీ కార్మికురాలి వద్ద బీడీలు చూడుతూ ఆమె సాదకబాధకాలను తెలుసుకున్నారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారినికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.