బిజేపీకి ఓటు ఎందుకు వేయాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

బిజేపీకి ఓటు ఎందుకు వేయాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బజార్ లో బిఅరెస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి పార్టి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో క్రూడాయిల్ ధర తగ్గిన పెట్రోల్ రేట్ తగ్గివకుండా సామాన్య పేద ప్రజల పైన బీజేపీ ప్రభుత్వం భారం వేస్తుందని అన్నారు.

ప్రతి పేదవారి అకౌంట్లో వేస్తా అన్న 15 లక్షల రూపాయలు ఎంత మంది అకౌంట్ లో వేశారో, పెద్ద పెద్ద వ్యాపురులు అయిన ఆదాని, అంబానీ వేల కోట్ల రూపాయలు ఎన్ పీ ఏ అకౌంట్ల ద్వారా మాఫీ చేశారని, కానీ సామాన్య ప్రజలకు, రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసింది.. ఏం చేస్తున్నది అని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయాకులు గిరి నాగాభూషణం, కొత్త మోహన్, గుంటి జగదిశ్వర్ తదితరులు పాల్గొన్నారు.