భక్తులతో పోటేత్తిన కొండగట్టు

భక్తులతో పోటేత్తిన కొండగట్టు

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పోటేత్తారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా భక్తులు అంజన్నను దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నారు.  ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరిoడేoట్ సునీల్  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయ డైరెక్టర్ కొంక నర్షయ్య తెల్లవారుజామునుంచి ఆలయంలో క్యూలైన్ వద్ద సేవా చేయడంతో పలువురు అభినందించారు. ఇది ఇలా ఉండగా, వాహనాలను ఇష్టానుసారంగా కొండపైకి వదలడంతో వై జంక్షన్ వద్ద ఉదయం ట్రాఫిక్ సమస్య తలేత్తిoది. కాగా, అంజన్నను దర్శించుకున్న జగిత్యాల జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ శైలందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ లు వేర్వేరుగా మాట్లాడుతూ కొండగట్టుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి,  సీఎం కేసీఆర్ ప్రకటించిన 500 కోట్ల పనులను ఎలక్షన్ లోపే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. భక్తులను ఆలయం ముందు నుంచి దర్శనంకు అనుమతిoచాలని అధికారులను కోరారు.