ఎన్ టి ఆర్ కు భారతరత్న ప్రకటించాలి.టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్

ఎన్ టి ఆర్ కు భారతరత్న ప్రకటించాలి.టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్

మెట్‌పల్లి ముద్ర:- మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కోరారు.ఆదివారం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ సామాజిక హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.పార్టీని స్థాపించి తొమ్మిది నెలలో పార్టీ అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కు దక్కిందన్నారు. పేద బడుగు బలహీనర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.రాజ, గణేష్, మహదేవ్,నిమ్మ రాములు, సాయాబు, మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్ల, వీరెల్ల గంగులు, అభిషేక్ మారుతి, మోహన్, పట్టణ అధ్యక్షులు జేరిపోతుల చందు, వెంకటేశం, మాధవరెడ్డి, తెడ్డు రాజం, శ్రీనివాస్ లు ఉన్నారు.