కొండగట్టు ఆలయ ఉప ప్రధానార్చకుడు మృతి

కొండగట్టు ఆలయ ఉప ప్రధానార్చకుడు మృతి

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఉప ప్రధానార్చకుడు తిరుకోవెల హరీoదర్ స్వామి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తన ఇంట్లో మృతి చెందినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం ఆలయ ఈవో టంకశాల వెంకటేష్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరిండెంట్ సునీల్ కుమార్, పలువురు అర్చకులు హరీoదర్ స్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. పలువురు నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.