హీరో శరత్ బాబు మృతి చిత్రసీమకు తీరని లోటు

హీరో శరత్ బాబు మృతి చిత్రసీమకు తీరని లోటు

మెట్‌పల్లి ముద్ర:- హీరో శరత్ బాబు మృతి సినీ పరిశ్రమకు  తీరని లోటని పడీపోయా నీ మాయలో సినిమా నిర్మాత భరత్ కుమార్ అంకతి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలంలోనీ వేములకుర్తి గ్రామంలో హీరో శరత్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చలన చిత్ర పరిశ్రమలో అనేక చిత్రల లో నటుడిగా,కథనాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన మహా నటుడు అని ఆయన మరణం భాధకరం అన్నారు.  నివాళులర్పించిన వారిలో నటులు రాధరపు ప్రభాకర్, అరె రమేష్ చంద్రరెడ్డి,యామపుర్ సహకారసంఘం మాజీ ఉపాధ్యక్షులు గుమ్మల రమేష్, ప్రెండ్స్ యుత్ అధ్యక్షుడు అరె నరేంధర్,రాధరపు నిథిన్,అన్నరపు శ్రీకాంత్,సున్నం రాకీ ఉన్నారు.