పాడి కౌశిక్ రెడ్డి నీ బర్తరఫ్ చేయాలి..  ముదిరాజ్ ల డిమాండ్..

పాడి కౌశిక్ రెడ్డి నీ బర్తరఫ్ చేయాలి..  ముదిరాజ్ ల డిమాండ్..

మెట్‌పల్లి ముద్ర: ముదిరాజ్ కుల విలేకరి పై దాడి చేసి కులం పేరుతో దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నీ ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని ముదిరాజ్ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని సంస్థాన్ బండలింగపూర్ గ్రామంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బండలింగపూర్ గ్రామం నుండి మెట్‌పల్లి నిజామాబాద్ జాతీయ రహదారి వరకు కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ కు శవ యాత్ర నిర్వహించి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి దిష్టి బొమ్మ దహనం చేశారు. ..ఓ మహిళ పాడి కౌశిక్ రెడ్డిని సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రశ్నించగా.ముదిరాజ్ కులం కు చెందిన రిపోర్టర్ అజయ్ న్యూస్ కవర్ చేస్తున్న కెమెరాను, మొబైల్ ఫోన్ ను లాక్కుని చంపుతానని బెదిరించి కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడిన కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని ముదిరాజులంతా ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు.గ్రామంలోని ఐదు సంఘాల ముదిరాజ్ కుల సభ్యులు పాల్గొన్నారు.