కొండముచ్చుతో 'కోతులకు' చేక్

కొండముచ్చుతో 'కోతులకు' చేక్

ముద్ర, మల్యాల: కోతుల బెడదకు చేక్ పెట్టేందుకు మండలంలోని తాటిపల్లి గ్రామంలో నెల రోజులుగా కొండముచ్చును తిప్పుతున్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు సర్పంచ్ బింగి జోష్ణవేణు స్వంత డబ్బులు 32 వెలతో కొండముచ్చును కొనుగోలు చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ వ్యక్తిని పెట్టుకొని, గ్రామంలో తిప్పుతున్నారు. దాన్ని చూడంగానే కోతులు గ్రామంలోకి రావడం లేదని పలువురు తెలిపారు. గ్రామంలో  కొండముచ్చును తిప్పడం వన్యప్రాణుల సంరక్షణ ఉల్లoఘన కిందకి వచ్చినప్పటికీ, ప్రజల అవసరాల దృష్ట్యా తప్పదని పలువురు పేర్కొన్నారు.