టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
రంగారెడ్డి : టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు ఉన్నాయి. తాండూరు ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పరీక్ష రాసిన 260 మంది విద్యార్థులు. తాండూరు స్కూలులోని రూమ్ నెంబర్ 5లో రిలీవర్ గా బందెప్ప ఉన్నాడు. ఆబ్సెంట్ అయిన విద్యార్థి ప్రశ్నప్రత్రాన్ని ఫోటో తీశాడు. మరో స్కూలులో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న సమ్మప్పకు ప్రశ్నపత్రం వాట్సాప్ చేశాడు. బందెప్ప పంపిన క్వశ్చన్ పేపర్ను మరికొంతమందికి పంపిన సమ్మప్ప. బందెప్ప, సమ్మప్ప పై కేసులు నమోదు చేసిన పోలీసులు. బందెప్ప, సమ్మప్పను ఏ 1, ఏ 2 నిందితులుగా చేర్చిన పోలీసులు. తాండూరు ఎంఈవో వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు.