అభివృద్ధి పనులకు నిధులు మంజూరు - ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు - ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ముదోల్ నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు 2.50 లక్షలు ముదిరాజ్ సంఘ భవనానికి 3.0 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే వివరించారు ఈ మేరకు ఉత్తర్వులను సంఘ సభ్యులకు మంగళ వారం అందజేశారు. విడుదల పట్ల సంఘాలవారు హర్షం వ్యక్తం చేశారు.