కేటీఆర్ పై అభిమానంతో ఆ జంట ఏం చేశారంటే..?

కేటీఆర్ పై అభిమానంతో  ఆ జంట ఏం చేశారంటే..?

హైదరాబాద్, ముద్ర బ్యూరో: ఓ జంటకు మే 5న వివాహం జరగనుంది. ఆ జంట పేరు ధీరజ్ గాడ్గే, వైష్ణవి. వాళ్లిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని నిర్ణయించారు. ఇద్దరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్ ) అంటే పిచ్చ అభిమానం. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రారంభించడానికి ముందు ఒక లవ్ సింబల్, పక్కనే కేటీఆర్ పేరు రాసి ప్రేమతో  ఆయన పేరు దగ్గర నిల్చుని తొలి ఫొటోకు పోజిచ్చారు. ఇది వైరల్ అయి కేటీఆర్ కు చేరడంతో దానిపై ఆయన స్పందించారు. కాబోయే నూతన దంపతులిద్దరికీ కృతజ్ఞతలు చెబుతూ, మీ మెసేజ్ నా వాట్సప్ లో వుందని, దీంతోనే నా రోజు మొదలయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు.