డీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం గేటు లోపలకు న బీజేవైఎం నేతలు దూసుకుపోయారు. ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి డీజీపీ కార్యాలయం గేటు లోకి వెళ్లి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసారు. పలువురు మహిళా అభ్యర్దులు కుడా డీజీపీ కార్యాలయం కు చేరుకున్నారు.