తొలిసారి ‘అధ్యక్షా..’
ముద్ర ప్రతినిధి, జనగామ: ఉమ్మడి వరంగల్ 12 నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో ఏడుగురు అభ్యర్థులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ‘అధ్యక్షా’ అనబోతున్నారు. పాలకుర్తి నుంచి మామిడాల యశస్విని (కాంగ్రెస్), వరంగల్ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్ (కాంగ్రెస్), మహబూబాబాద్- నుంచి మురళినాయక్ (కాంగ్రెస్), డోర్నకల్ నుంచి- రామచంద్రునాయక్ (కాంగ్రెస్), భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ (కాంగ్రెస్), వర్ధన్నపేట నుంచి కె.ఆర్- నాగరాజు (కాంగ్రెస్), జనగామ నుంచి- పల్లా రాజేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా తొలిసారిగా అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించనున్నారు.