తొలిసారి ‘అధ్యక్షా..’

తొలిసారి ‘అధ్యక్షా..’

ముద్ర ప్రతినిధి, జనగామ: ఉమ్మడి వరంగల్ 12 నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఇద్దరు బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో ఏడుగురు అభ్యర్థులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ‘అధ్యక్షా’ అనబోతున్నారు. పాలకుర్తి నుంచి మామిడాల యశస్విని (కాంగ్రెస్​), వరంగల్‌ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్ (కాంగ్రెస్‌), మహబూబాబాద్- నుంచి మురళినాయక్ (కాంగ్రెస్‌), డోర్నకల్ నుంచి- రామచంద్రునాయక్ (కాంగ్రెస్‌), భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ (కాంగ్రెస్‌), వర్ధన్నపేట నుంచి కె.ఆర్‌‌- నాగరాజు (కాంగ్రెస్‌), జనగామ నుంచి- పల్లా రాజేశ్వర్ రెడ్డి (బీఆర్‌‌ఎస్‌) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా తొలిసారిగా అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించనున్నారు.