సాయి చందు కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ

సాయి చందు కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ

సాయిచంద్ మరణం తెలంగాణకి తీరని లోటు :మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి :సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్,గాయకుడు సాయిచంద్ నిన్న గుండెపోటుతో మరణించడం తెలంగాణకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.శుక్రవారం నాడు గుర్రంగూడలోనీ సాయి ఇంటికి వెళ్లి సాయిచంద్ చిత్రపటానికి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్బంగా సాయిచంద్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు.