టీమిండియా ఐర్లాండ్​షెడ్యూల్!

టీమిండియా ఐర్లాండ్​షెడ్యూల్!

ముంబై: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత నెలరోజుల పాటు విరామం తీసుకున్న టీమిండియా ఆటగాళ్లు.. వెస్టిండీస్‌తో సిరీస్ నుంచి విరామం లేకుండా క్రికెట్ ఆడనున్నారు. వెస్టిండీస్ టూర్ జులై 12న ప్రారంభమై ఆగస్టు 13న ముగియనుంది. అయితే విండీస్‌తో మ్యాచులు ముగిసిన ఐదో రోజుల్లోపే టీమిండియా ఐర్లాండ్‌తో తలపడనుంది. మూడు మ్యాచుల టీ-20 సిరీస్‌ కోసం అక్కడ పర్యటించనుంది. ఈ మేరకు ఐసీసీ వెబ్‌సైట్‌లో సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పొందుపరిచింది. ఆగస్టు 18 నుంచి ఆగస్టు 23 వరకు మూడు మ్యాచులు జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు ఐసీసీ ట్వీట్‌ చేసింది. ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లను‌ ఆడనుంది. ఆగస్టు 18 నుంచి 23వ తేదీ మధ్యలో మ్యాచ్‌లు జరుగుతాయి. మలాహిడే వేదికగానే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయని షెడ్యూల్‌లో ఐసీసీ వెల్లడించింది. అన్ని మ్యాచులు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతాయి.

ఐర్లాండ్‌లో టీమిండియా షెడ్యూల్..

  • ఆగస్ట్‌ 18: తొలి టీ20 మ్యాచ్‌
  • ఆగస్ట్‌ 20: రెండో టీ20 మ్యాచ్‌
  • ఆగస్ట్‌ 23: మూడో టీ20 మ్యాచ్‌

"ఏడాదిలోపే రెండోసారి ఐర్లాండ్‌ పర్యటనకు వచ్చే టీమిండియా‌ ఆటగాళ్లకు స్వాగతం చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నాం. గతేడాది రెండు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను వీక్షించాం. ఈసారి మాత్రం 3 టీ20ల సిరీస్‌ సిద్ధం చేశాం. అభిమానులు సంతోషించేలా సిరీస్‌ను నిర్వహిస్తాం. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి ధన్యవాదాలు. తీరికలేని షెడ్యూల్‌లోనూ మా దేశ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయం" అని డ్యూట్రోమ్ తెలిపారు. గత ఏడాది కూడా హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా.. ఐర్లాండ్‌లో పర్యటించింది. రెండు మ్యాచుల టీ-20 సిరీస్‌ను భారత్ 2-0తో విజయం సాధించింది. ఈ సిరీస్ గతేడాది జూన్ చివరి వారంలో జరిగింది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ నుంచి సీనియర్లకు విశ్రాంతి నిచ్చే అవకాశం ఉంది.
..