బొడ్రాయి ప్రతిష్ట లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సతీష్ కుమార్

బొడ్రాయి ప్రతిష్ట లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే సతీష్ కుమార్

ముద్ర ప్రతి నిధి: సిద్దిపేట : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో రాష్ట్ర ఆర్థిక ,వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించారు.

హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ తో కలిసి గ్రామంలో శ్రీదేవి, భూదేవి ,బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామదేవతల వద్ద హరీష్ రావు , ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామస్తులు ఎమ్మెల్యేకు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఇద్దరు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోహెడ మండల ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.