ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో జెండా పాటలో పాల్గొన్న మంత్రి పువ్వాడ

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో జెండా పాటలో పాల్గొన్న మంత్రి పువ్వాడ

ఖమ్మం, ముద్ర: జిల్లా కేంద్ర ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఖమ్మం మార్కేట్ చరిత్రలో అత్యధికంగా క్వింటాల్‌ మిర్చికి రూ. 25,550 పలకడం ఇదే ప్రథమం. సోమవారంమిర్చి  మార్కేట్ లో నిర్వహించిన జెండా పాటలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జెండా పట్టి ధర నిర్ణయించారు. ఖమ్మం మార్కేట్ ను అంతర్జాతీయ మార్కేట్ కు చిరునామాగా తీర్చిదిద్దుతామని, చిల్లీస్ కు హబ్ గా చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దొరపల్లి శ్వేత, మార్కెట్ అధికారులు, వ్యాపారులు, కమిషన్ దారులు పాల్గొన్నారు